March 27, 2026

ఏపీ గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారధి కీలక ప్రకటన చేశారు. ఏపీలో సొంతిల్లు కోసం ఎదురుచూస్తున్నవారికి తీపికబురు అందించారు. కొత్త ఇళ్లు ఎప్పుడు మంజూరు అవుతాయనే దానిపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే నెలలోనే తుది జాబితా విడుదల అవుతుందని ఆయన తెలిపారు.

ఏపీలో ప్రభుత్వం నుంచి కొత్త ఇళ్లు ఎప్పుడెప్పుడు మంజూరు అవుతాయోనని ఎదురుచూసేవారి నిరిక్షణకు తెరపడింది. వచ్చే నెలలో కొత్త ఇళ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. పీఎం ఆవాస్ యోజన పథకంతో కలిపి రాష్ట్రంలో పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను నిర్మిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటాతో కొంత కలిపి కూటమి సర్కార్ ఇల్లు నిర్మించుకునేవారికి ఆర్ధిక సాయం అందిస్తోంది. పీఎం ఆవాస్ యోజన 2.0 కింద గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల నుంచి గత ఏడాది డిసెంబర్ వరకు దరఖాస్తులు ఆహ్వానించారు. అనంతరం దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించారు. కేంద్రం నుంచి పర్మిషన్ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ జాబితాను విడుదల చేయనుంది.

పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా ఇల్లు నిర్మించుకునేవారికి ప్రభుత్వం రూ.2.39 లక్షల ఆర్దిక సాయం అందిస్తుంది. ఇప్పటివరకు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వీటిని పరిశీలించాక 6.50 లక్షల మంది అర్హులుగా తేల్చారు. కేంద్రానికి ఈ జాబితా పంపించారు. అయితే కేంద్రం కూడా ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. అనంతరం లబ్దిదారులను గుర్తించి దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వచ్చే నెలలో లబ్దిదారుల జాబితాకు ఆమోదం తెలిపే అవకాశముందని ఏపీ గృహనిర్మాణశాఖ మంత్రి పార్థసారధి వివరించారు. సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పార్థసారధి కూడా పాల్గొనగా.. పీఎం ఆవాస్ యోజన జాబితాపై చర్చించారు. అనంతరం పై విధంగా కీలక ప్రకటన చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)