March 29, 2026

 ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. పీఎం ఇ-డ్రైవ్ పథకం కింద అందిస్తున్న సబ్సిడీ గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఎలక్ట్రిక్ టూవీలర్లపై రాయితీలను ఈ ఏడాది జూలై 31 వరకు, అలాగే ఇ-రిక్షా, ఇ-కార్టుల సబ్సిడీలను 2028 మార్చి 31 వరకు పొడిగించారు.

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మక పీఎం ఇ-డ్రైవ్ పథకం కింద అందుతున్న రాయితీలను పొడిగిస్తున్నట్లు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ టూవీలర్ కొనుగోలుదారులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. ఎలక్ట్రిక్ టూవీలర్లకు సబ్సిడీలను జూలై 31 వరకు పొడిగించారు. ఇ-రిక్షా, ఇ-కార్టులపై రాయితీలను ఏకంగా మార్చి 31, 2028 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. కేవలం టూవీలర్లు, త్రీవీలర్లు మాత్రమే కాకుండా ఇ-అంబులెన్సులు, ఇ-ట్రక్కులకు కూడా ప్రభుత్వం భారీగా రాయితీలు కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా మధ్యతరగతి ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాలు మరింత చేరువవుతున్నాయి. కాగా సబ్సిడీ గడువు పొడిగింపుతో కొత్తగా ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ముఖ్యంగా టూవీలర్ల విభాగంలో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఈవీ విప్లవానికి మరింత ఊతమివ్వనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)