January 29, 2026

PM Vidya Lakshmi Scheme: ఉన్నత విద్య చదవాలనే ఆసక్తి ఉండి, కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించని విద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ప్రధానమంత్రి విద్యా లక్ష్మి స్కీమ్ (PM Vidya Lakshmi Scheme). ఈ పథకం కింద ఒక విద్యార్థి 10 నుంచి 16 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు. తక్కువ వడ్డీకే ఈ రుణాన్ని అందజేస్తారు. కొన్ని సందర్భాల్లో వడ్డీని కూడా రద్దు చేస్తారు. ఎలాంటి హామీ లేకుండానే విద్యార్థులకు విద్యా లక్ష్మి యోజన ద్వారా రుణాలు లభిస్తాయి. ఈ పథకాన్ని 2024 నవంబర్ 6న ప్రారంభించారు. పూర్తి వివరాలు…

ప్రధానమంత్రి విద్యా లక్ష్మి పథకం అంటే ఏమిటి?

దేశంలోని ప్రతి విద్యార్థికి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘పీఎం విద్యా లక్ష్మి’ పథకాన్ని ప్రారంభించింది. 2024 కేంద్ర బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రకటించారు. 2024 నవంబర్ 6న ప్రధానమంత్రి విద్యా లక్ష్మి యోజన పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉన్నత చదువుల కోసం ఒక విద్యార్థికి ఈ పథకం కింద రూ.15-16 లక్షల వరకు రుణం ఇస్తారు. రూ. 10 లక్షల వరకు రుణం తీసుకుంటే కేవలం 3 శాతం మాత్రమే వడ్డీ చెల్లించాలి. కొన్నిసార్లు ఈ రుణంపై ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది. రుణం తీర్చడానికి 15 సంవత్సరాల సమయం ఉంటుంది. కోర్సు పూర్తయిన తర్వాత ఏడాది వరకు కూడా వడ్డీలో మినహాయింపు కల్పిస్తారు.

ఉన్నత విద్య చదవాలని చాలా మందికి కోరిక ఉంటుంది. కానీ, కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించక చాలా మంది ఆ కోరిక తీరకుండానే విద్యాభ్యాసం ముగిస్తారు. తమ కల నెరవేరకుండానే, జీవితం కోసం రాజీ పడతారు. ఏదో చిన్నా, చితకా ఉద్యోగంలో చేరిపోతారు. ఉద్యోగం రానివాళ్లు ఏదో ఒక కంపెనీలో కార్మికుడిగా చేరిపోతారు. లేకపోతే, వ్యవసాయంలో కుటుంబానికి సాయంగా నిలుస్తారు. పెద్ద చదువులు చదివి జీవితంలో ఉన్నతంగా సెటిల్ అయ్యే అవకాశం ఉన్నా.. పరిస్థితులు అనుకూలించక రాజీపడి అక్కడే ఆగిపోతారు. అలాంటి వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విద్యా లక్ష్మి పథకం (PM Vidya Lakshmi Scheme) ప్రారంభించింది. విద్యార్థి పైచదువులకు సంబంధించిన డబ్బును ప్రభుత్వమే చూసుకుంటుంది. ఈ పథకం ద్వారా ఉన్నత విద్య కోసం రుణం పొందడమే కాదు.. కొన్నిసార్లు ప్రభుత్వం మీకు వడ్డీని కూడా మాఫీ చేస్తుంది.

చాలా మంది తెలివైన విద్యార్థులు ఆర్థిక సమస్యల వల్ల చదువును మధ్యలోనే ఆపేస్తారు. అలాంటి విద్యార్థులకు పీఎం విద్యాలక్ష్మీ పథకం ఒక మంచి అవకాశం. ఒక్క మాటలో చెప్పాలంటే, జీవితాన్ని మలుపు తిప్పే ఛాన్స్.

పీఎం విద్యా లక్ష్మి పథకం ప్రత్యేకతలు:

  • టాప్ 860 క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్లలో సీటు వచ్చిన విద్యార్థులకు ఎలాంటి హామీ లేకుండానే రుణం లభిస్తుంది.
  • 7.5 లక్షల వరకు రుణం తీసుకుంటే 75% క్రెడిట్ గ్యారెంటీని ప్రభుత్వం ఇస్తుంది.
  • కుటుంబ వార్షిక ఆదాయం రూ.4.5 లక్షల వరకు ఉన్న విద్యార్థులకు వడ్డీలో 100% మినహాయింపు ఉంటుంది.
  • కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 8 లక్షలు ఉంటే, 10 లక్షల లోన్ పై 3% వడ్డీ సబ్సిడీ లభిస్తుంది.
  • రుణం తీర్చడానికి 15 సంవత్సరాల సమయం ఉంటుంది. కోర్సు పూర్తయిన తర్వాత ఒక సంవత్సరం వరకు వడ్డీలో మినహాయింపు ఉంటుంది.
  • ఏటా లక్ష మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.
  • ఈ పథకంలో అమ్మాయిలకు ప్రాధాన్యత ఉంటుంది.

పీఎం విద్యా లక్ష్మీ పథకం ముఖ్య లక్ష్యాలు:

★ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరూ చదువును మధ్యలో ఆపకూడదు.
★ ప్రతి విద్యార్థికి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉండాలి.

పీఎం విద్యా లక్ష్మీ పథకంలో వడ్డీ ఎంత ఉంటుంది?

విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం ఆధారంగా వడ్డీలో రాయితీ ఉంటుంది.

విద్యార్థి కుటుంబ వార్షికాదాయంటెక్నికల్/ ప్రొఫెషనల్ కోర్సులకుఇతర కోర్సులకు
రూ. 4.5 లక్షల వరకు100% వడ్డీ మాఫీ (PM-USP CSIS పథకం కింద)3% రాయితీ
రూ. 4.5 లక్షల నుంచి 8 లక్షలు3% Interest Subvention3% Interest Subvention

పీఎం విద్యా లక్ష్మీ పథకానికి ఎవరు అర్హులు?

  • భారతదేశంలోని విద్యా సంస్థలో సీటు పొందిన విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
  • విద్యార్థి గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 10వ తరగతి/ 12వ తరగతి పాసై (చేరబోయే కోర్సును బట్టి) ఉండాలి.
  • కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల వరకు ఉన్న విద్యార్థులకు మాత్రమే వడ్డీలో రాయితీ లభిస్తుంది.
  • విద్యార్థి టాప్ 860 క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు సంపాదించి ఉండాలి.
  • మెరిట్ ఆధారంగా సీటు వచ్చి ఉండాలి. డొనేషన్ ద్వారా వచ్చిన సీటుకు ఈ పథకం వర్తించదు.
  • విద్యార్థి చదువులో మంచిగా రాణిస్తూ ఉండాలి.
  • ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులుకాదు.
  • విద్యార్థికి అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ఇంటిగ్రేటెడ్ కోర్సు ఏదైనా ఒక కోర్సుకు మాత్రమే తీసుకునే రుణానికి వడ్డీ రాయితీ లభిస్తుంది.

పీఎం విద్యాలక్ష్మి పథకం కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

ప్రధానమంత్రి విద్యా లక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేయడానికి ఈ కింది దశలను అనుసరించండి:

STEP-1:

✧ ముందుగా పీఎం విద్యా లక్ష్మి పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.
✧ దీని కోసం అధికారిక పోర్టల్‌కు వెళ్లండి.
✧ “Student Login“పై క్లిక్ చేసి, ఆపై “Create An Account”పై క్లిక్ చేయండి.

STEP-2:

✧ ఇప్పుడు Student Registration Form ఓపెన్ అవుతుంది.
✧ అందులో మీ పేరు, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీ లాంటి వివరాలు నమోదు చేయండి.
✧ ఆ తర్వాత Generate OTP పై క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి, వెరిఫై చేయండి.
✧ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, మళ్లీ కన్ఫర్మ్ చేయండి.
✧ క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

STEP-3:

✧ అధికారిక పోర్టల్‌లో User ID మరియు Passwordతో లాగిన్ అవ్వండి.
✧ మీ ఇ-మెయిల్ ఐడీ మీ యూజర్ ఐీ అవుతుంది. OTPతో వెరిఫై చేయండి.
✧ Student Homepageలో “Apply for Education Loan”పై క్లిక్ చేయండి.
✧ అప్లికేషన్ ఫామ్‌లో అడిగిన మొత్తం సమాచారాన్ని పూరించండి.
✧ అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
✧ ఏ బ్యాంకు నుంచి రుణం కావాలో ఆ వివరాలను పూరించండి.
✧ వివరాలను చెక్ చేసుకొని సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.

పీఎం విద్యా లక్ష్మి అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?

✦ అధికారిక పోర్టల్‌లో మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
✦ “Track Loan Application”పై క్లిక్ చేయండి.
✦ లిస్ట్ నుంచి మీ లోన్ అప్లికేషన్ నంబర్‌ను ఎంచుకోండి.
✦ మీ లోన్ స్టేటస్ (Under Review/ Approved/ Processed) తెలుస్తుంది.

పీఎం విద్యా లక్ష్మి వడ్డీ రాయితీ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

  • పీఎం విద్యా లక్ష్మి స్కీమ్ కింద రుణం మంజూరైన తర్వాత అధికారిక పోర్టల్‌లో లాగిన్ అవ్వండి.
  • Student Homepageలో “Apply for Interest Subvention”ను ఎంచుకోండి.
  • “Claim Interest Subvention” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • అక్కడ అడిగిన వివరాలు నింపండి.
  • ఆదాయ ధృవీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయండి.
  • ఫామ్ సబ్మిట్ చేయండి. మీకు మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది.

పీఎం విద్యా లక్ష్మి పథకానికి సంబంధించి ఫిర్యాదు ఎలా చేయాలి?

మీకు ఏదైనా సమస్య ఉంటే, అధికారిక పోర్టల్‌లో “Initiate Grievance” సెక్షన్‌కు వెళ్లండి.

✧ “Register New Complaint”పై క్లిక్ చేయండి.
✧ మీ లోన్ అప్లికేషన్ నంబర్‌ను ఎంచుకోండి, ఫిర్యాదు రకాన్ని కూడా ఎంచుకోండి.
✧ ఏ బ్యాంకు నుంచి రుణం పొందారో ఆ బ్యాంక్ పేరు, వివరాలను నింపండి.
✧ మీ ఫిర్యాదు గురించి వివరంగా తెలపండి.
✧ సంబంధిత డాక్యుమెంట్లను కూడా అప్‌లోడ్ చేయండి.
✧ మీకు ఒక యూనిక్ ఐడీ వస్తుంది.

ఈ ఐడీ ద్వారా మీ కంప్లైంట్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. సాధారణంగా ఫిర్యాదు చేసిన వారం నుంచి రెండు నెలల (సమస్యను బట్టి) వరకు మీ సమస్యకు పరిష్కారం లభించవచ్చు.

పీఎం విద్యా లక్ష్మి పథకానికి కావలసిన డాక్యుమెంట్లు:

★ దరఖాస్తు ఫామ్
★ ఆధార్ కార్డ్
★ పాన్ కార్డ్
★ నివాస ధృవీకరణ పత్రం
★ 10వ తరగతి/ 12వ తరగతి మార్కుల జాబితా
★ ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మిషన్ కార్డ్, ఫీజు వివరాలు
★ ఆదాయ ధృవీకరణ పత్రం

పీఎం విద్యా లక్ష్మి పథకానికి ఎలాంటివారు దరఖాస్తు చేసుకోకూడదు?

  1. చదువును మధ్యలో ఆపేసిన విద్యార్థులు (వైద్య కారణాలు మినహాయింపు).
  2. క్రమశిక్షణా లేదా విద్యాపరమైన కారణాల వల్ల తొలగించబడిన విద్యార్థులు.
  3. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏదైనా ఇతర పథకం నుంచి లబ్ధి పొందుతున్న విద్యార్థులు.

పీఎం విద్యా లక్ష్మి పథకం ద్వారా రుణం ఎలా లభిస్తుంది?

విద్యార్థులకు CBDC వాలెట్/ e-voucher ద్వారా డబ్బు అందుతుంది. అయితే, విద్యార్థి ఒకవేళ 3 నెలల్లోపు ఉపయోగించకపోతే, డబ్బు తిరిగి వెళ్లిపోతుంది. చదువులో విద్యార్థి చూపించే ప్రతిభ ఆధారంగా ప్రతి సంవత్సరం ప్రయోజనం కొనసాగుతుంది.

పీఎం విద్యా లక్ష్మి పథకం కింద తప్పుడు సమాచారం ఇస్తే, ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

పీఎం విద్యా లక్ష్మి పథకం కింద రుణం పొందడానికి తప్పుడు సమాచారం ఇస్తే, విద్యార్థి నుంచి సబ్సిడీ మొత్తం తిరిగి తీసుకుంటారు. విద్యార్థి భవిష్యత్తులో ఏ ప్రభుత్వ పథకానికి అర్హుడు కాకుండా నిషేధం విధిస్తారు. కొన్నిసార్లు రుణం ఇచ్చిన బ్యాంకును కూడా బాధ్యులను చేయవచ్చు.

ఏ రాష్ట్రంలో ఎంత మంది విద్యార్థులకు వడ్డీ రాయితీ లభిస్తుంది?

రాష్ట్రాల జనాభా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కోటాను నిర్ణయిస్తుంది. దాని ప్రకారం విద్యార్థులకు వడ్డీ రాయితీ లభిస్తుంది. ఉదాహరణకు, బీహార్‌లో 10 వేల కంటే ఎక్కువ స్లాట్లు ఉన్నాయి, లక్షద్వీప్‌లో కేవలం 4 మాత్రమే ఉన్నాయి. పూర్తి జాబితా కోసం Annexure 5 చూడండి..

Annexure-5

PM_Vidyalaxmi_Scheme_Guidelines

ఒక రాష్ట్రం నుంచి ఎక్కువ దరఖాస్తులు వస్తే ఎంపిక ఎలా చేస్తారు?

ఒక రాష్ట్రం నుంచి పీఎం విద్యా లక్ష్మి కోసం ఎక్కువ దరఖాస్తులు వస్తే ఎంపికలో ప్రాధాన్యతా క్రమం ఇలా ఉంటుంది..

  1. ప్రభుత్వ సంస్థ
  2. సాంకేతిక/వృత్తి విద్యా కోర్సులు
  3. ప్రభుత్వ పాఠశాల నుంచి 12వ తరగతి/10వ తరగతి చదివిన వారు
  4. గ్రామీణ ప్రాంతం
  5. బాలికలు


‘దేశంలోని ప్రతి విద్యార్థికి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉండాలి. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరూ చదువును మధ్యలో ఆపకూడదు’ అనేది పీఎం విద్యాలక్ష్మి పథకం ముఖ్య ఉద్దేశం. డబ్బు లేదనే కారణంతో ఏ విద్యార్థీ ఉన్నత చదువులు చదవాలనే తన కోరికను చంపుకోవాల్సిన పనిలేదు. ఈ పథకం కింద రుణం తీసుకొని ఉన్నత చదువులు పూర్తిచేసి, తమ కెరీర్‌కు ఉన్నత బాటలు వేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)