Post Office Gram Suraksha Scheme 2026 :
గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం జీవితంలోని రోజువారీ ఖర్చులను భరిస్తూ పొదుపు చేయడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, తపాలా కార్యాలయం వారి ఒక అద్భుతమైన పథకం గురించి తెలియజేస్తున్నాము.కేవలం రోజుకు రూ.50 పెట్టుబడితో చేతికి రూ.35 లక్షల వరకు నిధిని సృష్టించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పథకమే ‘గ్రామ సురక్షా యోజన’. ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏమిటి :
- పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్షా యోజన అనేది గ్రామీణ తపాలా జీవిత బీమా (RPLI) కింద ప్రభుత్వం నడిపే ఒక పూర్తి జీవిత బీమా పాలసీ. దీనిని బీమా, దీర్ఘకాలిక పొదుపుల కలయికగా చూడవచ్చు. ఇది చిన్న పెట్టుబడిపై మంచి రాబడిని అందిస్తుంది.
- ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు భారతీయులై ఉండాలి.
- 19 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
- 55 ఏళ్లు, 58 సంవత్సరాలు, 60 ఏళ్లు ఇలా ఈ మూడింట్లో ఒకదానిని మెచ్యూరిటీ పీరియడ్గా ఎంచుకోవచ్చు.
- ఈ స్కీమ్లో కనిష్ఠంగా రూ.10,000 నుంచి గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
- నెలవారీగా, మూడు నెలలు, ఆరు నెలలకు ఓసారి ప్రీమియంలు చెల్లించవచ్చు.
ఈ పథకం లో నెలకు ఎంత ప్రీమియం చెల్లించాలి :
ఈ గ్రామ సురక్ష యోజన స్కీమ్లో చేరిన వ్యక్తి ప్రతి నెలకు ఎంత కట్టాలి అనేది మీ వయసు, మెచ్యూరిటీ పీరియడ్, బీమా మొత్తం వంటి వాటి మీద ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి. ఉదాహరణకు ఒక వ్యక్తి 19 సంవత్సరాల వయస్సులో రూ.10 లక్షల బీమా పాలసీ తీసుకుని 55 ఏళ్ల మెచ్యూరిటీ ఎంచుకుంటే అతను నెలకు రూ.1,515 లను ప్రీమియంగా చెల్లించాలి. అంటే రోజుకు 50 రూపాయలు. అతను 58 సంవత్సరాలు అయితే నెలకు రూ.1,463, 60 సంవత్సరాల వరకు స్కీమ్లో ఉంటే నెలకు రూ.1,411లను చెల్లించాలి. ప్రీమియం సకాలంలో చెల్లించకపోతే 30 రోజుల్లోపు డిపాజిట్ చేయవచ్చు.
ఈ పథకం ప్రయోజనాలు :
ఈ పథకం కింద 80 ఏళ్లు నిండిన వ్యక్తికి మెచ్యూరిటీ మొత్తాన్ని అందిస్తారు. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే.. ఈ మొత్తాన్ని నామినీకి అందిస్తారు. పథకంలో చేరిన మూడు సంవత్సరాల తరవాత పాలసీదారుడు ఈ పథకాన్ని నిలిపేయవచ్చు. అయితే పథకంలో చేరిన 5 సంవత్సరాల లోపు సరెండర్ చేస్తే బోనస్ రాదు. పథకంలో చేరిన నాలుగు సంవత్సరాల తర్వాత లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ పాలసీలో అతిపెద్ద హైలైట్ తపాలా శాఖ అందించే బోనస్. తపాలా శాఖ ప్రకటించిన ప్రకారం ప్రతి రూ.1,000కి సంవత్సరానికి రూ.60ల బోనస్ అందుతుంది.
మెచ్యూరిటీ సమయంలో రాబడి ఎలా ఉంటుంది :
- మీరు పథకం లో ఎన్ని సంవత్సరాలు పొదుపు చేశారు.. అనే దాని ఆధారంగా రాబడిని నిర్ణయిస్తారని గుర్తించుకోండి.
- మీరు 55 ఏళ్ల వరకు స్కీమ్లో పెట్టుబడి పెడితే మీకు రూ.31.60 లక్షలు,
- అదే 58 ఏళ్లు అయితే 32.40 లక్షలు,
- 60 ఏళ్ల వయస్సు వరకు పెట్టుబడి పెడితే రూ.34 లక్షలు మెచ్యూరిటీ సమయంలో వస్తాయి.