AP 10th Class Results 2026 :
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు పూర్తవడంతో.. ఇప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రులందరూ ఫలితాలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 3న పరీక్షలు ముగియగా, ఏప్రిల్ 15 నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది. అందుతున్న సమాచారం ప్రకారం, మే మొదటి వారంలో ఫలితాలను విడుదల చేసే అవకాశముంది. ఈసారి మార్కుల లెక్కింపులో పొరపాట్లు నివారించేందుకు ప్రభుత్వం ట్యాబ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. మూల్యాంకన కేంద్రాల్లో మార్కులను చేతితో నమోదు చేయడంతో పాటు ట్యాబ్లలో కూడా వెంటనే అప్లోడ్ చేస్తున్నారు. ప్రారంభంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురైనా, అధికారులు వాటిని త్వరగా పరిష్కరించి ప్రక్రియను సాఫీగా కొనసాగించారు.

ఈ సంవత్సరం మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, హాజరు శాతం సుమారు 99.5% గా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 3415 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మార్కుల ప్రాసెసింగ్ జరుగుతోంది. అన్నీ సవ్యంగా సాగితే మే మొదటి వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశముంది.
ఇక తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 13న పూర్తయ్యాయి. అక్కడ సుమారు 5.28 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. తెలంగాణలో కూడా మే 4 లేదా 5 తేదీల్లో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో మూల్యాంకనం ఇప్పటికే పూర్తయినందున, ఫలితాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://www.bse.ap.gov.in/ ను సందర్శించవచ్చు. అదేవిధంగా 9552300009 నంబర్కు వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు.